Nikhil Siddharth: 2019లో రిలీజైన ‘అర్జున్సువరవం’ తర్వాత హీరోగా మరోసారి వెండితెరపై నిఖిల్ (Nikhil Siddharth) కనిపించలేదు. చేతిలో నాలుగు సినిమాలు ఉన్నప్పటికీని కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్లు, రిలీజ్లు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ తరుణంలో నిఖిల్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్కు సిద్ధం అవుతున్నాయి.
నిఖిల్ కెరీర్లో మంచి హిట్గా నిలిచిన ‘కార్తికేయ’కు సీక్వెల్గా కార్తికేయ 2 వస్తుంది. సీక్వెల్ కూడా కార్తికేయ, చందుమొండేటి కాంబినేషన్లోనే రూపొందింది. అయితే బాలీవుడ్ నటుడు అనుమప్శేర్ కీలక పాత్ర పోషిం చారు. శ్రీకృష్ణుడి ద్వాపరయుగానికి, డాక్టర్ కార్తికేయకు సంబంధం ఏమిటీ? అన్న కోణంలో ఈ సినిమా ఉంటుంది. కార్తికేయ 2 చిత్రం ఈ ఏడాది జూలై 22న రిలీజ్ కానుంది.
Nikhil Karthikeya 2: ద్వాపరయుగంలో కార్తికేయ
నిఖిల్ గూఢచారిగా చేస్తున్న మొదటి యాక్షన్ థ్రిల్లర్కు ‘స్పై’ టైటిల్ను ఖరారు చేశారు. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో నిఖిల్ గూఢచారిపాత్రలో కనిపిస్తారు. ఐశ్వర్యామీనన్ హీరోయిన్. నిఖిల్ కెరీర్లో ఫస్ట్ ప్యాన్ఇండియన్ ఫిల్మ్గా రూపొందుతోన్న ఈ ‘స్పై’ మూవీ ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కానుంది.
నిఖిల్, అనుపమాపరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ 18 పేజీస్’. లవ్స్టోరీ బ్యాక్డ్రాప్లో రూపోందిన ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్పై త్వరలో ఓ స్పష్టత వస్తుంది.
ఇలా నిఖిల్ నటించిన మూడు చిత్రాలు ఒకే ఏడాది రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మరో రెండు కొత్త చిత్రాలకు నిఖిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.