మోహన్లాల్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 2019లో వచ్చిన మలయాళం‘లూసీఫర్’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మోహన్లాల్, ఫృధ్వీరాజ్ కాంబినేషన్లో మరో సినిమా అనగానే అందరు అదీ లూసీఫర్ సీక్వెలే అనుకున్నారు. కానీ వీరి కలయికలోని రెండో సినిమా ‘బ్రోడాడీ’గా రూపొందింది. అయితే హాట్రిక్ కాంబినేషన్ మాత్రం ‘లూసీఫర్’ సీక్వెలే. ‘లూసీఫర్’ సీక్వెల్ను వచ్చే ఏడాది మధ్యలో సెట్స్పైకి తీసుకుని వెళ్లనున్నట్లు పృధ్వీరాజ్ సుకుమారన్ చెబుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంచి తే… ప్రస్తుతం ‘లూసీఫర్’ సినిమా తెలుగులో ‘గాడ్ఫాదర్’గా తెరకెక్కుతుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్రాజా తెరకెక్కిస్తున్