Ntr With ThalapathyVijay66: తమిళ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసి ందే. సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరా బాద్లో జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, శ్యామ్, జయసుధ, శరత్కుమార్, సంగీత, సంయుక్తా, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద రాబాద్లో జరుగుతోంది. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రం యూనిట్.
అయితే తాజా సమాచారం ఏంటంటే..ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఈ నెల 20న అంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకులకు వెళ్లారు దర్శకుడు వంశీపైడిపల్లి. ఈ సమయంలో విజయ్ సినిమాలో ఓ అతిథిగా కనిపించాలని ఎన్టీఆర్ను కోరగా, ఎన్టీఆర్ పాజిటివ్గా స్పందించారట. గతంలో ఎన్టీఆర్, వంశీపైడిపల్లి కాంబినేషన్లో ‘బృందావనం’ అనే సక్సెస్ఫుల్ మూవీ వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపరి చిత్రంలో నాగార్జున, కార్తి నటించారు. నిజానికి.. ఈ చిత్రంలో కార్తి చేసిన పాత్రను ఎన్టీఆర్ చేయాల్సింది. కానీ అప్పట్లో వివిధ కారాణాల వల్ల కుదర్లేదు.