హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలాగే గడిచిన పది రోజుల్లో తనను కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాలని ఆమె విన్నవించుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం …బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ సినిమా షూటింగ్ కంప్లీటైనందుకు ఏర్పాటు చేసుకున్న సక్సెస్పార్టీలో ప్రగ్యా చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పుడు ప్రగ్యా తనకు కరోనా పాజిటివ్ అని చెప్పడంతో బాలయ్య, బోయ పాటి కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. దీంతో బాలకృష్ణ, బోయపాటితో పాటుగా
‘అఖండ’ టీమ్ అంతా టెన్షన్లో పడింది. మరోవైపు అక్టోబరు 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో బాలయ్య ఓటు వేశారు. మరి..ఆల్రెడీ కరోనా టెస్ట్ చేయించుకున్నారా?
కరోనా బారినపడ్డ హీరోయిన్…టెన్షన్లో బాలయ్య, బోయపాటి!
Leave a comment
Leave a comment