కథ
విక్టోరియా పురంలోని కేజే కాఫీ ఎస్టేట్స్కు ఇద్దరు అన్నదమ్ములు యజమానులు. వీరిద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీంతో కేజే కాఫీ ఎస్టేట్స్ ల్యాండ్ గొడవ కోర్టుకు వెళుతుంది. 1920 నుంచి 2023 వరకూ ఈ కోర్టు కేసు కొనసాగుతూనే ఉంటుంది. ఈ రెండు కుటుంబాల వారసలు వారి తాతల కేసును కొనసాగిస్తుంటారు.
ప్రధానతారాగణం: సంతోష్శోభన్, మాళవికా నాయర్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, వీకే నరేశ్, గౌతమి
దర్శకత్వం: బీవీ నందినీరెడ్డి
నిర్మాణం: వైజయంతీమూవీస్పై ప్రియాంకా దత్, çస్వప్నాదత్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
కెమెరా: సన్నీ, రిచర్డ్ ప్రసాద్
విడుదల: 18 మే 2023.
వీరిలో ఒక కుటుంబం ప్రసాద్(రాజేంద్రప్రసాద్), ఆయన భార్య మీనాక్షీ (గౌతమి). అతని ఇద్దరు కుమార్తెలు.
మరో కుంటుంబలో దివాకర్(రావు రమేష్), సుధాకర్(వీకే నరేశ్), సుధాకర్ భార్య (రమ్య సుబ్రహ్మాణియన్), సుధాకర్ దత్తపుత్రిక.
ఈ కోర్టు కేసు ఇలా ఉండగానే..మీనాక్షీ, సుధాకర్ భార్య ఒకేరోజు ఓకే హాస్సిటల్లో ఇద్దరు చిన్నారలకు జన్మనిస్తారు. ఈ ఇద్దరికీ డాక్టర్ జగదాంబ(ఆపరేషన్స్) చేస్తారు.
మీనాక్షీ పాప ఆర్య(మాళవిక నాయర్)కు జన్మనిస్తుంది. సుధాకర్ భార్య బాబు రిషి (సంతోష్ శోభన్) జన్మినిస్తుంది. కానీ జగదాంబ నిర్లక్ష్యం, హాస్పిటల్ సిబ్బంది పొరపాటు చేసి…. మీనాక్షీకి బాబును, సుధాకర్ భార్యకు పాపను ఇస్తారు.
ఒకేస్కూల్, కాలేజీలో చదువుకుంటుంటారు రిషి, ఆర్య. ఈ క్రమంలో ఆర్యతో ప్రేమలో పడతాడు రిషి.కానీ ఆర్యకు చెప్పడు. కొన్ని సంఘటనల వల్ల రిషిపై ఆర్య కోపం
పెంచుకుంటుంది.
మరి…ప్రసాద్, దివాకర్, సుధాకర్ల మధ్య ఉన్న కోర్టు కేసు ఫైనల్గా ఏమైంది? ఈ రెండు కుటుంబాలకు అసలు నిజం తెలిసినప్పుడు ఏం జరిగింది? రిషి, ఆర్యల ప్రేమకథ సక్సెస్ అయ్యిందా? లేదా? అనేవి సినిమాలో చూడాలి.
విశ్లేషణ
అన్నీ మంచి శకునములే సినిమా ప్రధానంగా ప్రసాద్, సుధాకర్, దివాకర్, రిషి, ఆర్య, మీనాక్షీ పాత్రల మధ్య జరుగుతుంది. రిషి, ఆర్యల ప్రేమ కథ..కోర్టు కేసు,.. ప్రసాద్ సిస్టర్ కొడుకు, కుమార్తెల మ్యారేజ్ ఇష్యూ… ఇలా కథలో మల్టీలేయర్స్ ఉంటాయి. ఇవి సామాన్య ప్రేక్షకుడిని అయోమయానికి లోను చేస్తాయి. ఒక్క పక్క కోర్టులో సీరియస్గా కేసు జరుగుతుంటే మరోవైపు రిషి, సుధాకర్లు కలిసి ఫ్రెండ్స్లా క్రికెట్ ఆడటం, తాను శత్రువులా భావించే సుధాకర్ కుమార్తె ఆర్యతో కలిసి యూరప్కు కాఫీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ప్లాన్ చేయడం..ఈ బిజినెస్లో ఎవరికీ వారు పార్ట్నర్ను మోసం చేయాలనుకోవడం చాలా సిల్లీ గా అనిపిస్తాయి. అంతే తండ్రి ప్రసాద్ను తప్పించి ఆయన ప్లేస్లో రిషి యూరప్కు వెళ్లాలనుకునే మరి తేలిపోయేలా ఉంటుంది. ఇంకా కథలో ఉన్న పాత్రలు సరిపోవంటూ వీలైనప్పుడల్లా రిషి కజిన్స్ రామ్, దివ్యల పాత్రలు ఎక్స్ట్రా తలనొప్పి. కాన్ఫ్లిక్ట్ అయిన కోర్టు కేసు కంప్లీట్గా ట్రాక్ తప్పి, లవ్స్టోరీ ట్రాక్లోకి వెళ్లడం ఆ తర్వాత రిషి కిజన్స్ మ్యారేజ్ ఎపిసోడ్ అంతా ఒప్పిగ్గా చూడాలి. ఇక సినిమా స్టార్టింగ్లోనే పిల్లలు మారిపోయారు కాబట్టి క్లైమాక్స్లో ఎలాగూ కలుస్తారు ఆడియన్స్ ఊహిస్తారు. కానీ ఈ కలిసే విధానంలో ఉన్న స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తిగా ఉండదు. ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి యాక్షన్ సీక్వెన్స్లు ఏమీ లేవు.
ఫెర్మార్మెన్స్
ఫుడ్ యూట్యూబ్ బ్లాగర్ రిషిగా సంతోష్శోభన్ యాక్ట్ చేశాడు. కానీ ఈ సినిమాలో ఇది ఓ లీడ్ రోల్ మాత్రమే . హీరో క్యారెక్టర్ అని మాత్రం చెప్పలేం. ఇక బిజినెస్ ఉమెన్గా మాళవికా నాయర్కు మంచి పాత్ర దక్కంది. కొన్ని సీన్స్లో మాళవిక నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్రప్రసాద్, రావురమేష్, వీకే నరేశ్లు వారి వారిపాత్రల్లో మెప్పించారు. రాజేంద్రప్రసాద్కు కాస్త ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్సీ లభించింది. ఇక సంతోష్శోభన్ అక్కగా వాసుకీ, బావగా వెన్నెల కిశోర్, ఫేక్ బ్యాంక్ మేనేజర్గా సత్య, డాక్టర్గా ఊర్వశీ, సంతోష్శోభన్ బామ్మగా షావుకారు జానకీ, ఆర్య అమ్మగా రమ్య, క్లైమాక్స్లో తాగుబోతు రమేష్ వారి పాత్రల మేరకు నటించారు. కథ, పాత్రలపై పెట్టిన దృష్టి స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శకులురాలు నందినీరెడ్డి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ ఒకే. నిర్మాణ విలువలు ఈ సినిమాకు తగ్గట్లు ఒకే. మిక్కీ జే మేయర్ సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. కాస్త ఎడి టింగ్ వర్క్ జరిగి ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో.
సినిమా: అన్నీ మంచి శకునములే
ప్రధానతారాగణం: సంతోష్శోభన్, మాళవికా నాయర్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, వీకే నరేశ్, గౌతమి
దర్శకత్వం: బీవీ నందినీరెడ్డి
నిర్మాణం: వైజయంతీమూవీస్పై ప్రియాంకా దత్, çస్వప్నాదత్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
కెమెరా: సన్నీ, రిచర్డ్ ప్రసాద్
విడుదల: 18 మే 2023.
Tollywood Young Heroes: కుర్రహీరోలు మాస్ ట్రాప్లో పడకండి!