Pooja hegde: రామ్చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘జిగేల్ రాణి’ అనే స్పెషల్ సాంగ్ చేశారు హీరోయిన్ పూజా హెగ్డే. ఈ సాంగ్ బంపర్హిటై్టంది. అయితే మళ్లీ ఇప్పుడు పూజాహెగ్డే మళ్లీ మరో స్పెషల సాంగ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ‘ఎఫ్ 2’ తర్వాత వెంకటేశ్, వరుణ్తేజ్లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ వస్తోంది. ఈ సినిమాలోనే ఓ స్పెషల్ సాంగ్కు పూజాహెగ్డేని సంప్రదించారట. అయితే ఇటు బాలీవుడ్లో సల్మాన్ఖాన్తో ‘కబీ ఈద్ కబీ దీవాళీ’, రణ్వీర్సింగ్తో ‘సర్కస్’, తెలుగులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్తో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమాలు కమిటైన పూజాహెగ్డే ఇప్పుడు ‘ఎఫ్ 3’ కోసం స్పెషల్ సాంగ్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం వేచి ఉండక తప్పదు. ఇక ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ సినిమా మే 27న థియేటర్స్లో విడుదల కానుంది.